Posts

Showing posts from May, 2023

ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు !

Image
ఎవ్వరూ మన సమస్యలు నివృత్తి చేయలేరు ! మరి మార్గం ఏమిటి ?   శులభమైన   మార్గాలు   చేతిలో   పెట్టుకుని ఎవరో మనల్ని ఉద్ధరిస్తారనుకోవడం అవివేకం. ఎక్కడో   డబ్బు   కట్టేస్తే   దోష పరిహారం అయ్యిందనుకుంటే పొరపాటే. అలాగే మన   తరఫున మరొకరు ఎక్కడో చేయడం, చేయించడం వలన ప్రయోజనం అధమం. ఇది   తెలియక,   తెలుసుకోక   సనాతన   సంప్రదాయాలు   వదిలేసి "అపస్మారకాసుర“ మాయలో పడి మూడవ వ్యక్తి పాదాలు పట్టుకోవడం మూర్ఖత్వం. ఆ సదరు వ్యక్తి ముక్కు పిండి పలు విధాల వసూలు చేస్తూనే ఉంటాడు. మన ధనం పోతూనే ఉంటుంది. సాధించేది మాత్రం ‘శూన్యం’. కనుకనే, సనాతన ధర్మాన్ని పద్ధతిగా ఆచరించడమైనా తెలుసుకోవాలి లేదా వేద-శాస్త్ర సమ్మతమైన గురువుని/ఆచార్యుడిని ఆశ్రయించడమైనా తెలియాలి.   ఎప్పుడైతే నిర్మలమైన, నిశ్చలమైన మనసుతో, స్వయంగా పరమాత్మ నామం పలుకుతూ, స్వహస్తాలతో సత్కార్యం మనమే చేసుకుంటామో అప్పుడు మాత్రమే పాపరాశి దహించుకుపోతుంది. ఇదే శీఘ్రమార్గం. అందుకనే పెద్దలు ‘త్రికరణశుద్ధి’గా అని అన్నారు. అప్పుడే కాలం, కర్మ, విధాత కలసివస్తాయి.   ప్రతి సమస్యకి సనాతన ధర్...

తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు, జాగ్రత్త 🧐

Image
తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు, జాగ్రత్త చెన్నై, మే 11 : కుటుంబములో సంస్కార లోపం, దాని పర్యవసానాల గురించి ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త శ్రీరామపాద భాగవతర్ తెలియజేశారు. దీని సారాంశం క్లుప్తముగా ఇచట పొందుపరుస్తున్నాం. నేటి ఆధునిక సమాజంలో పిల్లల్ని తప్పు మార్గానికి మళ్ళిస్తున్న మనుషులు, శక్తులు ఎక్కువైపోయాయి. తల్లి - తండ్రి - పిల్లలను విభజించి పాలిస్తున్నారు. దీని దుష్ప్రభావాలు అనుభవిస్తున్నా తెలుసుకోలేని పరిస్థితిలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మొట్టమొదలుగా తల్లితండ్రులను గౌరవించడం, వారి మాటలను పాటించి నడుచుకోవడం, వంశపారపర్యంగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలని పాటించడం నిత్య కర్తవ్యంగా అందరు తప్పక చేయాలి. మన కులదైవము, గ్రామదేవత పట్ల భక్తి కలిగి, నిత్యం మనసులోనైనా స్మరించుకోవాలి. వీటన్నిటినీ పిల్లలకి నేర్పించాలి. ఆ తరువాతే, చివరిగా, మూడవ వ్యక్తి (గురువైనా సరే) కి వందనములు, దానాలు, సేవలు. అందుకనే మన సనాతన సంప్రదాయంలో "మాతృదేవో భవ  పితృదేవో భవ  ఆచార్య (గురు) దేవో భవ " అన్నారు. చిన్న వయసులోనే పిల్లలకు సంప్రదాయ పద్ధతులు నిత్యకృత్యంగా అలవాటు చేయాలి. లేదంట...