కలిపురుషుడు విర్రవీగుతున్నాడు ! Excerpts from “Kurukshetra” - PART 2
కలిపురుషుడు విర్రవీగుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త !
(2) అర్జునుడు, "బాణం ఒక వృక్షం ముందు పడిందని, దానిపై కోకిల అందంగా కూస్తోందని, మధ్యమధ్యలో ఎలుకని తింటోందని" చెప్పాడు.
(3) నకులుడు, "బాణం ఒక గోశాలలో పడిందని, తల్లి గోవు దూడని నాలుకతో నాకుతూ ముద్దాడుతోందని” చెప్పాడు.
(1a) భీముడు చూసిన బావులలోని నీటిని గురించి : "ద్వాపర యుగంలో మూడింతలు ధర్మముంటే, కలియుగంలో ఒకింత మాత్రమే"నని.
(2a) అర్జునుడు చూసిన కోకిల ఎలుకని తినడం గురించి : "కలియుగంలో కులగురువులు, సత్యమైన జగద్గురువులు విస్మరించబడతారని, కలిగురువులు పుట్టుకొచ్చి నమ్మశక్యంగా తియ్యటి వచనాలు చెపుతూ, వెనుకన అదే నాలుకతో మోసపూరితంగా వ్యవహరిస్తారని".
(3a) నకులుడు చూసిన గోవు, దూడని ముద్దు చేసుకోవడం గురించి : "అతిగా ముద్దు చేసి తల్లితండ్రులే పిల్లల్ని పాడు చేస్తారని".
సరిగ్గా నేడు జరిగేవి ఇవే ! ఎంతో మంది పాలకులు, ప్రజలు, మట్టి కాళ్ళ మోడరన్ ఆచార్యులు, పీఠాధిపతులు తదనుగుణముగా ఆధునిక పండితులు ఇలాగే ఉన్నారు. తెలుసుకుని ధర్మాన్ని పట్టేవాడు తెలివికలవాడు-ధన్యుడు, విస్మరించేవాడు అవివేకి, పాపి అని శ్రీకృష్ణుడు ఉద్ఘాటించాడు.
గుణపాఠం :
శ్రీకృష్ణుడు హెచ్చరికతో జాగ్రత్త పడితే మంచిది. మనం శుద్ధిగా ఉంటూ, నిత్యం దీపారాధన చేసి ఆరాధన చేస్తే పరమాత్మ శక్తి మన ఇంటిలోనే ఉందని అర్థమవుతుంది. సమాజంలో ఎటుచూసినా మోసం! ఎక్కడికో వెళ్ళి 'మాయలో పడి' కాలాన్ని వృధా చేస్తూ 'అవ' దూతల మురికి పాదాలు పట్టుకుని డబ్బుని వృధా చేయడం కంటే, ధర్మ సూక్ష్మాలను తెలుసుకుని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు🌹
https://www.facebook.com/Sriramapada.Bhagavathar/
https://www.youtube.com/@Sriramapada.Bhagavathar
facebook.com/Sriramapada
Note :
Rights reserved. Copy, alteration, reproduction is prohibited.
Sharing as it is permitted.